పింఛన్ డబ్బుల పంపిణీలో బీపీఎంపై దాడి
ABN , First Publish Date - 2022-12-10T00:24:22+05:30 IST
ఇర్విన్లో బీపీఎంగా పని చేస్తున్న కట్టరాములు శుక్రవారం లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు పంచుతున్నాడు.
మాడ్గుల, డిసెంబరు 9: ఇర్విన్లో బీపీఎంగా పని చేస్తున్న కట్టరాములు శుక్రవారం లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు పంచుతున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పగడాల శ్రీశైలం అనే వ్యక్తి మద్యం మత్తులో వచ్చి రాములుపై దాడికి దిగాడు. పింఛన్ పంచడానికి నువ్వు ఎవరివంటూ బయోమెట్రిక్ మిషన్ను లాక్కునే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా కులం పేరుతో దుర్బాషలాడినట్లు బాధితుడు కట్టరాములు వాపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీశైలంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.