అంబేద్కర్‌ జ్ఞానసభను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-12-02T00:09:31+05:30 IST

ఈ నెల 6న కోస్గిలో జరిగే అంబేడ్కర్‌ జ్ఞానసభను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎరన్‌పల్లి శ్రీనివాస్‌ అన్నారు.

అంబేద్కర్‌ జ్ఞానసభను విజయవంతం చేయాలి

కొడంగల్‌/దౌల్తాబాద్‌, డిసెంబరు 1 : ఈ నెల 6న కోస్గిలో జరిగే అంబేడ్కర్‌ జ్ఞానసభను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎరన్‌పల్లి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో స్థానిక ఐబీలో అంబేడ్కర్‌ జ్ఞానసభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి యం.కృష్ణంరాజు, ఎరన్‌పల్లి శ్రీనివాస్‌లు మాట్లాడుతూ.. జ్ఞానసభకు కొడంగల్‌ నియోజకవర్గంలోని ప్రజాసంఘాల నాయకులు, అభ్యుదయ వాదులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘం తాలూకా అధ్యక్షుడు భీమరాజు, ధర్మపురి అశోక్‌, ఎస్టీ సెల్‌ మండల అధ్యక్షుడు తార్యానాయక్‌, అంబేడ్కర్‌ సంఘం నాయకులు ప్రమోద్‌, గౌరిగాళ్ల కృష్ణ, చిన్న, బాల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో అంబేడ్కర్‌ యువజన సంఘం మండల అధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌ ఆధ్వర్యంలో వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శిరీషరమేశ్‌, ఎంపీటీసీ మంజులదస్తప్ప, అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు మాలే అంజీ, భీములు, మోహన్‌, బెల్లం అంజీ, వీరేశ్‌, ఆంజనేయులు, వెంకట్‌, సాయిలు, అప్పిరాజు, అల్లాపూరం భీములు, సురేందర్‌, బాల్‌చందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:09:33+05:30 IST