లోన్‌ యాప్‌ ఉచ్చులో యువకుడు

ABN , First Publish Date - 2022-10-12T05:10:50+05:30 IST

లోన్‌ యాప్‌ ఉచ్చులో యువకుడు

లోన్‌ యాప్‌ ఉచ్చులో యువకుడు

  • సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

పరిగి, అక్టోబరు11: లోన్‌యా్‌ప ఉచ్చులో పడిన ఓ యువకుడికి బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో అతడు సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన యువకుడు శ్రీనివాస్‌ తన అవసరాల నిమిత్తం ప్లేస్టోర్‌లో.. రేటింగ్‌ బాగా ఉందని వండర్‌లోన్‌ అప్లికేషన్‌ను తన మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నాడు. ఆధార్‌, పాన్‌కార్డు,సెల్ఫీ ఫొటోతో సహా అతడికి సంబంధించిన వివరాలు అప్లోడ్‌ చేశాడు. ఆ తర్వాత వడ్డీ ఎక్కువగా ఉందని లోన్‌ వద్దనుకొని ఆప్లికేషన్‌ను డిలీట్‌ చేశాడు. అయితే అతడి ఖాతాలో రూ.9వేలు జమఅయ్యాయి. వారం తర్వాత లోన్‌ డబ్బులు చెల్లించాలని యాప్‌ నిర్వాహకుల నుంచి కాల్స్‌ వచ్చాయి. దీంతో అతడు రూ. 9వేలు తిరిగి చెల్లించాడు. అనంతరం యాప్‌ నిర్వాహకులు పలుమార్లు శ్రీనివా్‌సకు ఫోన్‌ చేసి ఇంకా డబ్బులు చెల్లించాలని అడిగారు. డబ్బులు చెల్లించనిచో బూత్‌ వాయిస్‌ మేసేజ్‌లు, న్యూడ్‌ ఫొటోలను కాంటాక్టు లిస్టులో ఉన్నవారికి పంపుతామని బెదిరించారు. దీంతో బాధితుడు శ్రీనివాస్‌ మంగళవారం సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు.


Updated Date - 2022-10-12T05:10:50+05:30 IST