ప్రజావాణిలో 76 అర్జీలు
ABN , First Publish Date - 2022-06-07T05:35:42+05:30 IST
ప్రజావాణిలో 76 అర్జీలు
మేడ్చల్ అర్బన్, జూన్ 6: పెండిం గ్ సమస్యలు పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డీఆర్వో లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 76 అర్జీలు వచ్చాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. ఈ ప్రజావాణిలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.