వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-08-22T12:05:43+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తజనంతో పోటెత్తింది. శ్రావణమాసం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తజనంతో పోటెత్తింది. శ్రావణమాసం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని తరించారు.  స్వామివారికి  ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం, అన్నపూజ, నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, బాలాత్రిపురాసుందరీదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమపూజ తదితర ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో స్వామివారి దర్శనం కోసం రెండు గంటలకుపైగా సమయం పట్టగా, కోడెమొక్కు చెల్లింపు కోసం మూడు గంటల సమయం పట్టింది. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-08-22T12:05:43+05:30 IST