TS News: వికారాబాద్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన పద్మారావు గౌడ్

ABN , First Publish Date - 2022-09-17T15:27:15+05:30 IST

తెలంగాణ జాతీయ సమైక్యతా దినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ ఎస్పీ పెరేడ్ గ్రౌండ్లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

TS News: వికారాబాద్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన పద్మారావు గౌడ్

వికారాబాద్: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని (National unity celebrations) పురస్కరించుకుని వికారాబాద్ ఎస్పీ పెరేడ్ గ్రౌండ్లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ (Padmarao Goud)జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ.. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సహాల్లో భాగంగా మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అన్నిరంగాల్లో ముందుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా రెడ్డి, వికారాబాద్,పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్వర్ రెడ్డి, రోహిత్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డి హాజరయ్యారు. 

Updated Date - 2022-09-17T15:27:15+05:30 IST