నేషనల్ హెరాల్డ్ కేసులో టీ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

ABN , First Publish Date - 2022-09-23T18:22:56+05:30 IST

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు (National Herald case)లో తెలంగాణ కాంగ్రెస్ నేతల (Telangana Congress leaders)కు ఈడీ (ED) నోటీసులు

నేషనల్ హెరాల్డ్ కేసులో టీ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

Hyderabad : నేషనల్‌ హెరాల్డ్‌ కేసు (National Herald case)లో తెలంగాణ కాంగ్రెస్ నేతల (Telangana Congress leaders)కు ఈడీ (ED) నోటీసులు అందజేసింది. 8 మంది తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. షబ్బీర్‌ అలీ (Shabbeer Ali), సుదర్శన్‌రెడ్డి (Sudarshan Reddy), అంజన్‌కుమార్‌ యాదవ్‌ (Anjan Kumar Yadav)... రేణుకాచౌదరి (Renuka Choudary), గీతారెడ్డి (Geetha Reddy) సహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది. అక్టోబర్‌ 10న ఢిల్లీ (Delhi)లో ఈడీ విచారణకు హాజరు కావాలని తెలిపింది. అయితే తమకు ఇంకా నోటీసులు అందలేదని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) తదితరులను ఈడీ విచారించింది. ఈడీకి సహాయం చేసిన నేతల్లో అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav), గీతారెడ్డి (Geetha Reddy) పేర్లు ఉన్నాయి. 


ఈ విషయమై అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ కేసులో ఈడీ నుంచి తనకు ఏలాంటి నోటీసులు అందలేదన్నారు. తాను కూడా విరాళం ఇచ్చానని... ఇప్పటి వరకూ తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. గీతా రెడ్డి సైతం తనకు ఇప్పటి వరకూ ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు. తాను నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు ఆర్థిక సహాయం చేశానని.. అది చెక్కు రూపంలోనే ఇచ్చానన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించి తకు ఎలాంటి నోటీసు అందలేదన్నారు. ఈ కేసు విషయమై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. 




Updated Date - 2022-09-23T18:22:56+05:30 IST