ఎవరో వచ్చి జిల్లాల్లో పర్యటించాల్సిన అవసరం లేదు: ఎంపీ కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2022-04-24T22:30:36+05:30 IST
ఎవరో వచ్చి జిల్లాల్లో పర్యటించాల్సిన అవసరం లేదు: ఎంపీ కోమటిరెడ్డి
హైదరాబాద్: పీకే చేరికపై, పొత్తులపై హైకమాండ్దే తుది నిర్ణయమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్తో కలిసి పనిచేసే అవకాశం లేదని, రాహుల్గాంధీ సభపైనే దృష్టిపెట్టామని ఆయన తెలిపారు. జిల్లాల వారీగా బలమైన నేతలున్నారని, వారే జనసమీకరణ చేస్తారని.. సన్నాహక భేటీలు ఏర్పాటు చేస్తారని చెప్పారు. అంతా మేమే చేస్తామంటే కుదరదని, ఎవరో వచ్చి జిల్లాల్లో పర్యటించాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.