Kavitha: ఈడీ, ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు

ABN , First Publish Date - 2022-11-23T16:21:46+05:30 IST

ఈడీ, ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ కవిత (Kavitha) స్పష్టం చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా టీఆర్ఎస్‌ (TRS) నేతలు ఆగం కావద్దని సూచించారు.

Kavitha: ఈడీ, ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు

కామారెడ్డి: ఈడీ, ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ కవిత (Kavitha) స్పష్టం చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా టీఆర్ఎస్‌ (TRS) నేతలు ఆగం కావద్దని సూచించారు. తెలంగాణలో బీజేపీకి ఏం పని? అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ (BJP)కి నాయకుడు లేడని, ఐడియాలజీ లేదని తప్పుబట్టారు. రామ్ రామ్ జప్నా.. పరాయి లీడర్ అప్నా పాలసీ అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. బీఎల్‌ సంతోష్ ఎందుకు కోర్టుకు రావడం లేదు?... ఆయనను ఎందుకు అరెస్ట్‌ చేయొద్దు? అని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ పిలిస్తే తాము వెళ్లాలి.. కానీ వాళ్లు (బీజేపీ) మాత్రం రారని కవిత విమర్శించారు.

Updated Date - 2022-11-23T16:21:47+05:30 IST