కుక్కర్లోని నీళ్లు పడి చిన్నారికి గాయాలు
ABN , First Publish Date - 2022-11-27T00:24:49+05:30 IST
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో కుక్కర్లోని నీళ్లు మీద పడి అనుశ్రీ అనే ఐదేళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. అంగన్వాడీ కేంద్రంలో శనివారం ఉదయం సిబ్బంది వంట చేస్తున్నారు.
ఎడపల్లి, నవంబరు 26: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో కుక్కర్లోని నీళ్లు మీద పడి అనుశ్రీ అనే ఐదేళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. అంగన్వాడీ కేంద్రంలో శనివారం ఉదయం సిబ్బంది వంట చేస్తున్నారు. ఈక్రమంలో అక్కడే ఆడుకుంటున్న బాలికపై కుక్కర్ మూసే క్రమంలో ఒక్కసారిగా పైకి ఎరిగింది. దీంతో అందుకున్న ఉన్న వేడినీరు పడి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు బోధన్లోని ఓ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతుంది. బోధన్ సీడీపీవో వినోద ఆస్పత్రికి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.