తల్లి హత్య కేసులో కొడుకు అరెస్టు

ABN , First Publish Date - 2022-03-16T05:32:45+05:30 IST

మండలంలోని సికింద్రాపూర్‌ గ్రామానికి చెందిన సంబోజి కళావతి(70)ని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు ఆమె కొడుకు శివకుమార్‌ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు ఏసీపీ వెంకటేశ్వర్‌ తెలిపారు. మంగళవారం జక్రాన్‌పల్లిలో హత్య వివరాలను విలేకరులకు వెల్లడించారు. సికింద్రా పూర్‌లో ఈనెల 12న శివకుమార్‌ మద్యం తాగి ఇంటికి విచ్చి ఇంట్లో మంచంపై ఉన్న తల్లి కళావతితో గొడవపడ్డాడు. కర్ర, గొడ్డలితో ఆమె విచక్షణ రహితంగా కొట్టి హత్య చేశాడని తెలిపారు. అదేరోజు కళావ తిని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. శివకుమార్‌ మద్యం తాగి రోజూ ఆమెతో గొడవపడేవాడని, నీ వల్లే భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిందని తెలిపారు. శివకుమార్‌ తప్పించుకొని తిరుగుతుండ గా మంగళవారం సికింద్రాపూర్‌ వద్ద పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌ పంపినట్టు తెలిపారు. డిచ్‌పల్లి సీఐ డి.ప్రతాప్‌, జక్రాన్‌పల్లి ఎస్సై శ్రీ కాంత్‌, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

తల్లి హత్య కేసులో కొడుకు అరెస్టు

జక్రాన్‌పల్లి, మార్చి15: మండలంలోని సికింద్రాపూర్‌ గ్రామానికి చెందిన సంబోజి కళావతి(70)ని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు ఆమె కొడుకు శివకుమార్‌ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు ఏసీపీ వెంకటేశ్వర్‌ తెలిపారు. మంగళవారం జక్రాన్‌పల్లిలో హత్య వివరాలను విలేకరులకు వెల్లడించారు. సికింద్రా పూర్‌లో ఈనెల 12న శివకుమార్‌ మద్యం తాగి ఇంటికి విచ్చి ఇంట్లో మంచంపై ఉన్న తల్లి కళావతితో గొడవపడ్డాడు. కర్ర, గొడ్డలితో ఆమె విచక్షణ రహితంగా కొట్టి హత్య చేశాడని తెలిపారు. అదేరోజు కళావ తిని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. శివకుమార్‌ మద్యం తాగి రోజూ ఆమెతో గొడవపడేవాడని, నీ వల్లే భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిందని తెలిపారు. శివకుమార్‌ తప్పించుకొని తిరుగుతుండ గా మంగళవారం సికింద్రాపూర్‌ వద్ద పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌ పంపినట్టు తెలిపారు. డిచ్‌పల్లి సీఐ డి.ప్రతాప్‌, జక్రాన్‌పల్లి ఎస్సై శ్రీ కాంత్‌, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. 


Updated Date - 2022-03-16T05:32:45+05:30 IST