మామిడిపల్లిలో ఒకరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-11-28T00:08:27+05:30 IST
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి గ్రా మంలో చందూర్ మండలానికి చెందిన కుదాన్వార్ రాజేశ్వర్చారి(45) అ ప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్హెచ్వో సురేష్బాబు తెలిపా రు. జీవనోపాధికై రెండేళ్ల క్రితం ఆర్మూర్కు వచ్చి గోల్డ్స్మిత్ వర్క్ చేస్తూ జీ వనం సాగిస్తున్నాడు. గతంలో ఉన్న అప్పులు తీర్చలేక కిరాయికి ఉంటున్న ఇంటిలో సిలింగ్ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, భార్య వ సంత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న ట్టు ఎస్హెచ్వో సురేష్బాబు తెలిపారు.
ఆర్మూర్టౌన్, నవంబరు27: మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి గ్రా మంలో చందూర్ మండలానికి చెందిన కుదాన్వార్ రాజేశ్వర్చారి(45) అ ప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్హెచ్వో సురేష్బాబు తెలిపా రు. జీవనోపాధికై రెండేళ్ల క్రితం ఆర్మూర్కు వచ్చి గోల్డ్స్మిత్ వర్క్ చేస్తూ జీ వనం సాగిస్తున్నాడు. గతంలో ఉన్న అప్పులు తీర్చలేక కిరాయికి ఉంటున్న ఇంటిలో సిలింగ్ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, భార్య వ సంత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న ట్టు ఎస్హెచ్వో సురేష్బాబు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
క్రిమిసంహారక మందు తాగి..
ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన పసుల రాజేశ్వర్ (45) తాగుడికి బానిసై గుర్తుతెలియని క్రిమిసంహారక మందు తాగి వ్యక్తి మృతి చెందినట్టు ఎస్హెచ్వో సురేష్బాబు తెలిపారు. మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ..
జక్రాన్పల్లి: మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన గాజుల చిన్న ముత్తెన్న (45) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు ఎస్సై కుం ట శ్రీకాంత్ తెలిపారు. లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన గాజుల చిన్న ము త్తెన్న ఈనెల 24న సాయంత్రం పశువులను తొలుతుండగా వెనుక నుంచి లెగదూడ వచ్చి బలంగా ఢీకొట్టడంతో తీవ్రగాయమైనట్టు తెలిపారు. చికి త్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్సై తెలిపారు. మృతుడి అల్లుడు రవీందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.