గ్రామాల్లో జాతీయ గీతాలాపన చేయాలి
ABN , First Publish Date - 2022-08-16T06:19:19+05:30 IST
భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రజలందరు సాముహిక గీతాలాపన కార్యక్రమంలో బాగస్వాములాయ్యోల తెలియజేయాలని ఎంపీడీవో చిన్నారెడ్డి అన్నారు.
దోమకొండ, ఆగస్టు 15: భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రజలందరు సాముహిక గీతాలాపన కార్యక్రమంలో బాగస్వాములాయ్యోల తెలియజేయాలని ఎంపీడీవో చిన్నారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 75వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా గ్రామాలలో ఇంటిపై జాతీయజెండాను ఎగురవేయాలని సూచించారు. ప్రజలందరు గీతాలాపనలో పాల్గొనలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో తిరుపతిరెడ్డి, ఏపీవో రజని,యుగేందర్, శ్రీకాంత్, కార్యదర్శులు సౌజన్య, రమేష్, భానుశ్రీ, అఖిల, అరుణ, రాహుల్గౌడ్, అంజిబాబు, రాజశేఖర్, సుధాకర్ పాల్గొన్నారు.