మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-03-17T04:54:53+05:30 IST

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎస్సై గుగులోత్‌ నరేష్‌ తెలిపారు. సిరికొండ మండలం తూంపల్లి గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో నేరాలు జరుగకుండా ఉండాలంటే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో గంజాయికి యువకులు, విద్యార్థులు అలవాటు పడుతున్నారనే సమాచారం ఉందన్నారు. దానికి బానిసలయితే పరిస్థితి అథోగతి అవుతుందన్నారు. మద్యం తాగి డ్రైవింగ్‌ చేయవద్దని కోరారు. వేగంగా వా హనాలను డ్రైవ్‌ చేయవద్దని సూచించారు. సమావేశంలో సర్పంచ్‌ పల్లె బా లమణి మల్లేష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మాలవత్‌ రాములు నాయక్‌, ఎంపీటీసీ సభ్యులు మాలవత్‌ లింగం, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి

సిరికొండ మార్చి 16: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎస్సై గుగులోత్‌ నరేష్‌ తెలిపారు. సిరికొండ మండలం తూంపల్లి గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో నేరాలు జరుగకుండా ఉండాలంటే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో గంజాయికి యువకులు, విద్యార్థులు అలవాటు పడుతున్నారనే సమాచారం ఉందన్నారు. దానికి బానిసలయితే పరిస్థితి అథోగతి అవుతుందన్నారు. మద్యం తాగి డ్రైవింగ్‌ చేయవద్దని కోరారు. వేగంగా వా హనాలను డ్రైవ్‌ చేయవద్దని సూచించారు. సమావేశంలో సర్పంచ్‌ పల్లె బా లమణి మల్లేష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మాలవత్‌ రాములు నాయక్‌, ఎంపీటీసీ సభ్యులు మాలవత్‌ లింగం, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-17T04:54:53+05:30 IST