వర్సిటీ సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళనలు

ABN , First Publish Date - 2022-08-22T04:29:25+05:30 IST

తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోనలు కొనసాగుతాయని, ప్రొఫెసర్లు కావాలనే విద్యార్థులతో ధర్నాలు చేయిస్తున్నారని వీసీ వ్యాఖ్యనించడం ఎంతవరకు సమంజమని విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నించారు. ఆదివారం వర్సి టీలోని బాలికల హాస్టల్‌ గేటు ముందు వారు విలేకరులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులందరూ ఉమ్మడిగా ఉద్యమాలు చే స్తున్న పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదన్నారు.

వర్సిటీ సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళనలు

డిచ్‌పల్లి, ఆగస్టు 21: తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోనలు కొనసాగుతాయని, ప్రొఫెసర్లు కావాలనే విద్యార్థులతో ధర్నాలు చేయిస్తున్నారని వీసీ వ్యాఖ్యనించడం ఎంతవరకు సమంజమని విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నించారు. ఆదివారం వర్సి టీలోని బాలికల హాస్టల్‌ గేటు ముందు వారు విలేకరులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులందరూ ఉమ్మడిగా ఉద్యమాలు చే స్తున్న పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదన్నారు. ఆందోళన చేస్తున్న విద్యా ర్థుల పట్ల తెలుగు ప్రొఫెసర్‌ కనకయ్య అవమాన పరిచేలా మాట్లాడడం శోచనీయమన్నారు. విద్యార్థులకు బహిరంగా క్షమాపణ చెప్పాలని, ఆయ నను విధుల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. ఇటీవలే రిజిస్ట్రార్‌ గా బాధ్యతలు తీసుకున్న విద్యావర్ధిని కనకయ్యపై చర్యలు తీసుకోలేనని చెప్పడం సబబు కాదన్నారు. కనకయ్యతో వీసీ క్షమాపణ చెప్పిస్తానని హామీ ఇచ్చి నెరవేర్చడం లేదన్నారు. వర్సిటీలో పాలక మండలి సమావే శం ఏర్పాటు చేయాలని, అవినీతి వీపీని ప్రభుత్వం తొలగించాలన్నారు. సమావేశంలో సంతోష్‌, సాయిబాబా, నిఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-22T04:29:25+05:30 IST