కలెక్టరేట్‌ మైదానాన్ని కాపాడాలి

ABN , First Publish Date - 2022-12-13T00:29:09+05:30 IST

పాత కలెక్టరేట్‌ పక్కన ఉన్న కలెక్టరేట్‌ మైదానాన్ని యథావిధిగా కొనసాగించి క్రీడాకారులకు ఉన్న ఏకైక మైదానాన్ని కాపాడాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నగరంలోని కంఠేశ్వర్‌ ఆలయం నుంచి నూతన కలెక్టరేట్‌ వరకు సోమవారం రన్‌ నిర్వహించారు.

కలెక్టరేట్‌ మైదానాన్ని కాపాడాలి

నిజామాబాద్‌అర్బన్‌, డిసెంబరు 12: పాత కలెక్టరేట్‌ పక్కన ఉన్న కలెక్టరేట్‌ మైదానాన్ని యథావిధిగా కొనసాగించి క్రీడాకారులకు ఉన్న ఏకైక మైదానాన్ని కాపాడాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నగరంలోని కంఠేశ్వర్‌ ఆలయం నుంచి నూతన కలెక్టరేట్‌ వరకు సోమవారం రన్‌ నిర్వహించారు. ఈ రన్‌ను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హుందాన్‌లు ప్రారంభించారు. జిల్లా నుంచి అంతర్జాతీయస్థాయిలో క్రీడాకారులు రానిస్తున్నారని ఇలాంటి పరిస్థితిల్లో జిల్లాకేంద్రం మధ్యలో ఉన్న మైదానాన్ని తొలగించడం వల్ల క్రీడాకారుల ఇబ్బందులు పడే అవకాశం ఉందని తెలిపారు. దానిని అలానే ఉంచాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్‌ మైదానం తరలింపు, నూతన ఇండోర్‌ స్టేడియం నిర్మాణం విషయంలో స్పష్టతనివ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, జావెద్‌అక్రం, గంగారెడ్డి, ఎజాజ్‌, బొబ్బిలి నర్సయ్య, ఈసా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:29:10+05:30 IST