మోటార్లకు కెపాసిటర్లు బిగించాలి
ABN , First Publish Date - 2022-08-17T06:42:58+05:30 IST
వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్లు బిగించాలని రైతులకు కెపాసిటర్లు బిగించుకునేలా అవగాహన క ల్పించాలని ఆపరేషన్ డైరెక్టర్ మోహన్రెడ్డి ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని విద్యుత్ ప్రగతిభవన్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఏ ర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
సుభాష్నగర్, ఆగస్టు 16: వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్లు బిగించాలని రైతులకు కెపాసిటర్లు బిగించుకునేలా అవగాహన క ల్పించాలని ఆపరేషన్ డైరెక్టర్ మోహన్రెడ్డి ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని విద్యుత్ ప్రగతిభవన్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఏ ర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ కలెక్షన్లను ఎప్పటికప్పుడు మెరుగుపర్చాలని రెవెన్యూ టార్గెట్లకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. వినియోగదారులకు నాణ్యమైన కరెంటు అందించాలని ట్రాన్స్ఫార్మర్ ఫేల్యూర్లను తగ్గించాలని అన్నారు. బిల్లుకట్టకుండా బకాయిలు ఉన్న బిల్డింగ్లకు, వ్యాపారసంస్థలకు నోటీసులు ఇవ్వాలని, బయట నోటీస్బోర్డులు పెట్టాలని సూచించారు. లింకు సర్వీసులపై కూడా దృష్టిపెట్టాలని తెలిపారు. మీటర్ రీడింగ్ను తొందరగా పూర్తిచేయాలని కోరా రు. నూతన సర్వీసులు ఇచ్చేటప్పుడు అనుమతులు ఉన్నాయా లేవా అని చూసుకుని కేటగిరి నిర్ధారణ చేసుకుని ఇవ్వాలని తెలిపారు. ఆగిపోయిన సర్వీసులను మూడు నెలల్లో బిల్లు వసూలు చేయాలని తెలిపారు. మొండి బకాయిలను త్వరగా వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రవీందర్, డీఈలు, ఏడీఈలు, ఏఈలు, విద్యుత్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.