సాగర్‌ కాలువలో మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-08-18T05:02:51+05:30 IST

మండల కేంద్ర సమీపంలోని నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో బుధవారం మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించగా మృతురాలు కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం బైరాపూర్‌ గ్రామానికి చెందిన సంపంగి నాగమణి (42)గా గుర్తించినట్లు ఎస్సై వెల్లడించారు. మతిస్థిమితం సరిగ్గా లేక ఈనెల 13న ఇంటి నుంచి వెళ్లి మృతురాలు నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో దూకినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాస్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

సాగర్‌ కాలువలో మృతదేహం లభ్యం

వర్ని, ఆగస్టు 17: మండల కేంద్ర సమీపంలోని నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో బుధవారం మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించగా మృతురాలు కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం బైరాపూర్‌ గ్రామానికి చెందిన సంపంగి నాగమణి (42)గా గుర్తించినట్లు ఎస్సై వెల్లడించారు. మతిస్థిమితం సరిగ్గా లేక ఈనెల 13న ఇంటి నుంచి వెళ్లి మృతురాలు నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో దూకినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాస్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. 

Updated Date - 2022-08-18T05:02:51+05:30 IST