బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్
ABN , First Publish Date - 2022-12-06T23:41:33+05:30 IST
బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ అని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.
కామారెడ్డి టౌన్, డిసెంబరు 6: బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ అని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో అంబేద్కర్ చిత్ర పటానికి కలెక్టర్, టీఎన్జీవోస్లు పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అంబేద్కర్ అని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించి సమాజంలో అందరు సమానమనే భావనను తీసుకు వచ్చిన మహానీయుడని అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరించి చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల రైల్వేబ్రిడ్జి ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలతో పాటు కామారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ, టీఆర్ఎస్ యువజన విభాగం, కేవీపీఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్, స్థానిక సంస్థల అదన పు కలెక్టర్ వెంకటేష్దోత్రే, సీఈవో రాజారాం, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిలు, బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాటిపల్లి వెంకటరమ ణారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీనివాస్, కేవీపీఎస్ జిల్లా అధ్య క్షుడు సంతోష్, భానుప్రసాద్ తదిత రులు పాల్గొన్నారు.