హత్య కేసులో నిందితుడికి పదేళ్ల శిక్ష
ABN , First Publish Date - 2022-08-25T06:07:18+05:30 IST
హసాకొత్తూర్ గ్రామంలోని మారుతినగర్ కాలనీకి చెం దిన ఇరుగుదండ్ల రాములు (45)ను హత్య చేసిన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దూంపేట గ్రామానికి చెందిన బోదాసురాజ్యంకు విచారణ అనంతరం నేరం రుజువుకావడంతో జడ్జి సునీత కుంచాల పదేళ్ల శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. 2020 మే 2న మారుతి నగర్ కాలనీకి చెందిన రాములుతో బోదాసు రాజ్య గొడవకు దిగి కర్రలతో కొట్టుకున్నారని తెలిపారు. రాములు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు చెప్పారు. రాములు కొడుకు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు తెలిపారు.
నిజామాబాద్లీగల్/కమ్మర్పల్లి, ఆగస్టు 24: హసాకొత్తూర్ గ్రామంలోని మారుతినగర్ కాలనీకి చెం దిన ఇరుగుదండ్ల రాములు (45)ను హత్య చేసిన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దూంపేట గ్రామానికి చెందిన బోదాసురాజ్యంకు విచారణ అనంతరం నేరం రుజువుకావడంతో జడ్జి సునీత కుంచాల పదేళ్ల శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. 2020 మే 2న మారుతి నగర్ కాలనీకి చెందిన రాములుతో బోదాసు రాజ్య గొడవకు దిగి కర్రలతో కొట్టుకున్నారని తెలిపారు. రాములు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు చెప్పారు. రాములు కొడుకు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు తెలిపారు.