వడదెబ్బకు మహిళ మృతి
ABN , First Publish Date - 2022-05-18T06:58:14+05:30 IST
హుజూర్నగర్లో పండ్ల వ్యాపారి ఫాతిమా (56) వడదెబ్బతో మంగళవారం మృతిచెందింది. పట్టణంలోని ఇందిరా సెంటరులో పండ్ల వ్యాపారం చేస్తూ జీవిస్తున్న ఆమె వారంరోజుల క్రితం వడదెబ్బకు గురైంది.
హుజూర్నగర్, మే 17: హుజూర్నగర్లో పండ్ల వ్యాపారి ఫాతిమా (56) వడదెబ్బతో మంగళవారం మృతిచెందింది. పట్టణంలోని ఇందిరా సెంటరులో పండ్ల వ్యాపారం చేస్తూ జీవిస్తున్న ఆమె వారంరోజుల క్రితం వడదెబ్బకు గురైంది. అప్పటినుంచి ఇంట్లోనే చికిత్స పొందుతున్న ఫాతిమా మంగళవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు.