వేములకొండను మండలంగా ప్రకటించాలి
ABN , First Publish Date - 2022-09-11T05:59:29+05:30 IST
వేములకొండను మత్స్యాద్రి వేములకొండ మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.
వలిగొండ, సెప్టెంబరు 10: వేములకొండను మత్స్యాద్రి వేములకొండ మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గ్రామ అంబేడ్కర్ చౌరస్తా వద్ద కొనసాగుతున్న నిరసన శనివారం నాటికి 57వ రోజుకు చేరింది కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు శ్యామరాంరెడ్డి, ఆకుల వెంకన్న, బొడిగె బాలయ్య, ఎలగందుల అంజయ్య, జనార్ధనరెడ్డి, రాంచంద్రం పాల్గొన్నారు.