నలుగురు సీఐల బదిలీలు

ABN , First Publish Date - 2022-09-08T06:33:19+05:30 IST

రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నలుగురు సీఐలను బదిలీచేస్తూ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. భువనగిరి రూరల్‌ సీఐ టి.వేణుగోపాల్‌ను భువనగిరి స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ అయ్యారు. చౌటుప్పల్‌ రూరల్‌ సీఐ ఎ.వెంకటయ్యను భువనగిరి రూరల్‌ సీఐ గా నియమించారు.

నలుగురు సీఐల బదిలీలు

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 7: రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నలుగురు సీఐలను బదిలీచేస్తూ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. భువనగిరి రూరల్‌ సీఐ టి.వేణుగోపాల్‌ను భువనగిరి స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ అయ్యారు. చౌటుప్పల్‌ రూరల్‌ సీఐ ఎ.వెంకటయ్యను భువనగిరి రూరల్‌ సీఐ గా నియమించారు. స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.యాదయ్యను సీసీఎస్‌ ఎల్బీనగర్‌కు, అక్కడ పనిచేస్తున్న మహేశ్‌ను చౌటుప్పల్‌ రూరల్‌ సీఐగా బదిలీచేశారు.  

Updated Date - 2022-09-08T06:33:19+05:30 IST