మూడు క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-11-28T01:38:23+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న మూడు క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

మూడు క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

అనంతగిరి, నవంబరు 27: అక్రమంగా తరలిస్తున్న మూడు క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ ఐలయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెంకట్రాంపురం గ్రామ శివారులో పోలీసులు వాహనా లను తనిఖీ చేస్తుండగా, కోదాడ నుంచి వాయిలసింగారం వైపు ఆటో నెం. ఏపీ 20టీసీ 4976లో అక్రమంగా తరలిస్తున్న మూడు క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న తమ్మరబండ గ్రామా నికి చెందిన సికిందర్‌పై కేసు నమోదు చేసిన ఆటోని సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-11-28T01:38:26+05:30 IST