ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి
ABN , First Publish Date - 2022-11-27T23:47:13+05:30 IST
విద్యార్థుల ఆలోచనలు ఉన్నతంగా ఉండాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అక్షరఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షర బాలోత్సవం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సూర్యాపేటటౌన్, నవంబరు 27: విద్యార్థుల ఆలోచనలు ఉన్నతంగా ఉండాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అక్షరఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షర బాలోత్సవం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభ దాగి ఉంటుందని, దాని ని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదేనన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. కష్టపడి చదివి ప్రతీ ఒక్కరికి ఆదర్శం గా ఉండాలన్నారు. అంతకముందు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నా యి. కార్యక్రమంలో స్వశోదన్ ట్రస్టు చైర్మన్ కరుణాకర్రెడ్డి, డీఎస్పీ నాగభూషణం, ఎన్జీవో స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాస రాంకుమార్రెడ్డి, అక్షర ఫౌండేషన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఉప్పునాగయ్య,పాల్వాయి వెంకన్న,జనార్థనాచారి, హనుమాచారి, డాక్ట ర్ సుధీర్, కాళిదాసు, తిరుమల్రెడ్డి, పాపయ్య, సుభాష్ చంద్రబోస్, వీరాసింగ్ పాల్గొన్నారు.