రీడ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
ABN , First Publish Date - 2022-02-23T06:13:17+05:30 IST
పాఠశాలల్లో రీడ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డీఈవో అశోక్ అన్నారు. తిరుమలగిరిలో ఎమ్మార్పీ కేంద్రాన్ని, జడ్పీహెచ్ఎ్స, ప్రా థమిక పాఠశాలల, అదేవిధంగా మండలంలోని తాటిపామముల ఉన్నత పాఠశాలను ఆయన మంగళవారం తనిఖీ చేసి, మా ట్లాడారు.
తిరుమలగిరి / తిరుమలగిరి రూ రల్, ఫిబ్రవరి 22 : పాఠశాలల్లో రీడ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డీఈవో అశోక్ అన్నారు. తిరుమలగిరిలో ఎమ్మార్పీ కేంద్రాన్ని, జడ్పీహెచ్ఎ్స, ప్రా థమిక పాఠశాలల, అదేవిధంగా మండలంలోని తాటిపామముల ఉన్నత పాఠశాలను ఆయన మంగళవారం తనిఖీ చేసి, మా ట్లాడారు. వంద రోజుల పఠన కార్యక్రమంతో విద్యార్థుల్లో నైతిక విలువలు పెరుగుటకు, స్వతంత్రంగా పుస్తకాలు చదివే అలవాటు, సృజనాత్మకత అభివృద్ధి చెందుతాయన్నారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను తరచూ నిర్వహించాలన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో ఎన్నికైన పాఠశాలల్లో ఆయా గ్రామసర్పంచులు, ఎస్ఎంసీ చైర్మన్లు, పూర్వవిద్యార్థులు, దాతల సహకారంతో అబివృద్ధి పనులు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో శాంతయ్య, ప్రధానోపాధ్యాయులు అశోక్రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.