కల్లుగీత వృత్తికి ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించాలి
ABN , First Publish Date - 2022-09-30T06:09:03+05:30 IST
లిక్కర్, శీతల పానీయాలతో అంతరించిపోతున్న కల్లుగీత వృత్తికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించి, వృత్తికి వారికి ఉపాధి కల్పించాలని కల్లు గీత కార్శిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రమణ డిమాండ్ చేశారు.
జిల్లా మహాసభలో మాట్లాడుతున్న రమణ
ఆత్మకూర్(ఎస్), సెప్టెంబరు 29: లిక్కర్, శీతల పానీయాలతో అంతరించిపోతున్న కల్లుగీత వృత్తికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించి, వృత్తికి వారికి ఉపాధి కల్పించాలని కల్లు గీత కార్శిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రమణ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామంలో గురువారం జరిగిన కల్లుగీత కార్శిక సంఘం జిల్లా రెండో మహాసభలో మాట్లాడారు. గ్రామాల్లో కల్లు వృత్తిని నమ్ముకునే వారు ఉపాధి కోసం పట్టణాలకు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. పట్టణాల్లో వలసపోయిన గౌడ కులస్థులు చాల ఇబ్బందులు పడు తున్నారన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్గూరి గోవి ంద్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, అబ్బగాని భిక్షంగౌడ్, ఊయల నగేష్, కృష్ణ, అంజయ్య, జయమ్మ, ఇస్తారి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.