పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ABN , First Publish Date - 2022-04-24T05:50:34+05:30 IST
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎ మ్మెల్యే రవీంద్రకుమా ర్ అన్నారు.
చింతపల్లి, ఏప్రి ల్ 23: పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎ మ్మెల్యే రవీంద్రకుమా ర్ అన్నారు. శనివారం మండలంలోని పోలేపల్లి రాంనగర్, చింతపల్లి గ్రామాల్లో కల్యా ణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. పోలేపల్లి రాంనగర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎ్సలో చేరా రు. మండలంలోని జర్పులతండాలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా కా ర్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్రనేత కంకణాల వెంకట్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి, జిల్లా నాయకులు నట్వ గిరిధర్, గునరెడ్డి శ్రీనివా్సరెడ్డి, అండేకార్ అశోక్, మాల్ మార్కెట్ వైస్ చైర్మన గోపిడి కిష్టారెడ్డి, నాయకులు విద్యాసాగర్రావు, పులిరాజుగౌడ్, శ్రీశైలంగౌడ్, అశోక్, చాంద్పాష పాల్గొన్నారు.