పొడిచేడులో శ్రీకాంతాచారి వర్ధంతి సభ రేపు

ABN , First Publish Date - 2022-12-02T00:19:01+05:30 IST

మండలంలోని పొడిచేడులో ఈ నెల 3న ఉదయం 10 గంటలకు తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాం తాచారి 13వ వర్ధంతి సభను నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్‌ జిల్లానేత తీపిరెడ్డి మేఘారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ కొణతం యాకూబ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పొన్నెబోయన రమేష్‌ తెలిపారు.

పొడిచేడులో శ్రీకాంతాచారి వర్ధంతి సభ రేపు
సమావేశంలో మాట్లాడుతున్న మేఘారెడ్డి

మోత్కూరు, డిసెంబరు 1: మండలంలోని పొడిచేడులో ఈ నెల 3న ఉదయం 10 గంటలకు తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాం తాచారి 13వ వర్ధంతి సభను నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్‌ జిల్లానేత తీపిరెడ్డి మేఘారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ కొణతం యాకూబ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పొన్నెబోయన రమేష్‌ తెలిపారు. గురువారం మోత్కూరు మార్కెట్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ సభకు మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ హాజరవుతారన్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మాట్లాడుతూ మోత్కూరులో శ్రీకాంతాచారి విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో మండల, పట్టణ ప్రధాన కార్యదర్శు లు శ్రీను, మల్లేష్‌, కొండ సోంమల్లు, నాగయ్య, మాజీ శ్రీనివాస్‌, విష్ణుమూర్తి, వెంకటేష్‌, తిరుమలేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:19:02+05:30 IST