యాదగిరిగుట్టలో హరిహరులకు విశేష పూజలు

ABN , First Publish Date - 2022-10-04T05:48:22+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం హరిహరులకు విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.

యాదగిరిగుట్టలో హరిహరులకు విశేష పూజలు
ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, అక్టోబరు 3: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం హరిహరులకు విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో స్వయంభువులు లక్ష్మీనృసింహుడికి, స్మార్త సంప్రదాయ పద్ధతిలో శివాలయంలోని రామలింగేశ్వరస్వామికి, స్ఫ టిక రామలింగేశ్వరుడికి నిత్యవిధి కైంకర్యాలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు లక్ష్మీనృసింహుడిని 9,542మంది భక్తులు దర్శించుకోగా, వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.18,97,076 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.


వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు

యాదగిరిగుట్ట ప్రధానాలయ అనుబంధ ఆలయమైన శివాలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు దుర్గాష్టమిని పురస్కరించుకుని విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. శివాలయంలో కొలువుదీరిన పర్వతవర్ధినీ అమ్మవారిని ఆరాదిస్తూ అర్చకులు ప్రాతఃకాల పూజ, సహస్రనామార్చన, వేదపారాయణలు, గాయత్రీ జపాలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయ యాగశాలలో చండీ హవనం జరిపారు. సాయంత్రం 7.30గంటలకు నవావరణ పూజ, సువాసినీ పూజలను శైవాగమ పద్ధతిలో నిర్వహించారు.

Updated Date - 2022-10-04T05:48:22+05:30 IST