సాగర్ ఎస్ఈకి సీఈగా పదోన్నతి
ABN , First Publish Date - 2022-04-05T05:55:43+05:30 IST
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎస్ఈ ధర్మానాయక్ పదోన్నతిపై బదిలీ అయ్యారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు బదిలీ
నాగార్జునసాగర్, ఏప్రిల్ 4 : నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎస్ఈ ధర్మానాయక్ పదోన్నతిపై బదిలీ అయ్యారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీఈగా ఆయన నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లుగా సాగర్ ప్రాజెక్టు ఎస్ఈగా ధర్మానాయక్ బాధ్యతలు నిర్వహించారు.