ఘనంగా కొవొత్తుల సమర్పణ
ABN , First Publish Date - 2022-01-03T05:53:17+05:30 IST
మునుగోడు మే జర్ గ్రామపంచాయతీ పరిధిలోని కమ్మగూడెం ఏసు నామకరణ దేవాలయం (చర్చి) వజ్రోత్స వాన్ని విచారణ గురువు ఫాదర్ ధనరాజ్ లింగారెడ్డి ఆధ్వర్యంలో వైౖభవంగా కొనసాగుతున్నా యి.
కమ్మగూడెం చర్చీలో కొవ్వొత్తులు సమర్పిస్తున్న చేస్తున్న క్రైస్తవులు
మునుగోడు, జనవరి 2: మునుగోడు మే జర్ గ్రామపంచాయతీ పరిధిలోని కమ్మగూడెం ఏసు నామకరణ దేవాలయం (చర్చి) వజ్రోత్స వాన్ని విచారణ గురువు ఫాదర్ ధనరాజ్ లింగారెడ్డి ఆధ్వర్యంలో వైౖభవంగా కొనసాగుతున్నా యి. రెండోరోజైన ఆదివా రం సాయంత్రం చర్చీలో క్రైస్తవులు కొవొత్తుల సమర్పించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రా ర్ధనలు చేశారు. ముందుగా బ్యాండ్ వాయిద్యాల నడుమ క్రైస్తవులు తమ ఇంటి నుం చి సామూహిక ప్రదర్శనలతో కొవొత్తులను తీసుకువచ్చారు. రాత్రి సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలో భక్తి గీతాలపై ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఉత్తేజపరిచాయి. ఈ వేడుకల్లో భాగంగా చర్చీతో పాటు మరియామాత, ముఖద్వారం వంటి పలుచోట్ల విద్యుత దీపాలను అందంగా అలంకరించారు.