విద్యార్థినికి నియామక పత్రాన్ని అందజేస్తున్న ప్రిన్సిపాల్‌ హేమామాళిని

ABN , First Publish Date - 2022-09-08T05:58:58+05:30 IST

ఫార్మసీ విద్యకు అధిక ప్రాధాన్యం ఉందని స్వామి వివేకానంద పార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.హేమామాళిని అన్నారు.

విద్యార్థినికి నియామక పత్రాన్ని అందజేస్తున్న ప్రిన్సిపాల్‌ హేమామాళిని



ఫార్మసీ విద్యకు అధిక ప్రాధాన్యం: ప్రిన్సిపాల్‌

యాదగిరిగుట్ట రూరల్‌, సెప్టెంబరు 7: ఫార్మసీ విద్యకు అధిక ప్రాధాన్యం ఉందని స్వామి వివేకానంద పార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.హేమామాళిని అన్నారు. బుధవారం మండలంలోని వంగపల్లి గ్రామంలోని స్వామి వివేకానంద పార్మసి కళాశాల, అపోలో ఫార్మసి సంస్థ ఆధ్వర్యంలో ఫార్మసి పూర్తి చేసిన సుమారు 100మంది విద్యార్థులకు ఉద్యోగం కోసం ఇంటార్వ్యులు నిర్వహించి, 40మందిని ఉద్యోగాలకు అర్హులుగా గుర్తించి ఎంపిక వారికి అర్హత పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఫార్మసీ విద్యార్థులదే కీలక పాత్ర ఉంటుందని, వారికి ప్రతి వ్యాధిపై పూర్తి అవగహన ఉంటుందని తెలిపారు. వైద్యులు రోగాలను నిర్ధారిస్తే వారికి కావాల్సిన మందులను అందజేసి, ప్రాణాలను కాపాడేందుకు ఫార్మసి విద్యార్థులు తమవంతు తోడ్పాటు అందిస్తారని అన్నారు. 12 సంవత్సరాల నుంచి తమ కళాశాల తరపున సుమారు 400మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసి పంపించామని, ఇంటార్వ్యులకు హాజరైన విద్యార్థులకు కృతజ్ఞతలను తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సెక్రెటరి ఎం.వెంకట్‌రెడ్డి, డైరెక్టర్‌ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ ఎల్‌ఎం.గిరి, ఏవో వేణుగోపాల్‌రెడ్డి, అపోలో ఫార్మసీ అసిస్టెంట్‌ మేనేజర్‌ హెచ్‌ఆర్‌ రఘుపతి పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-08T05:58:58+05:30 IST