పీఆర్సీని అమలు చేయాలి
ABN , First Publish Date - 2022-09-14T05:19:20+05:30 IST
గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించి 11వ పీఆర్సీ అమలు చేయాలని జీపీ ఎం ప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షు డు గణపతిరెడ్డి డిమాండ్చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామపంచాయతీ సిబ్బంది ధర్నాకు దిగారు.
భువనగిరి రూరల్, సెప్టెంబరు 13: గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించి 11వ పీఆర్సీ అమలు చేయాలని జీపీ ఎం ప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షు డు గణపతిరెడ్డి డిమాండ్చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామపంచాయతీ సిబ్బంది ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఏళ్ల తరబడి పంచాయతీలో పనిచేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్మికులకు పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి, బీమా సౌకర్యం అమలుచేసి మృతి చెందిన కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్చేశారు. అనంతరం కలెక్టర్ పమేలాసత్పథిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డిచంద్రారెడ్డి, దా సరి పాండు, నాయకులు పి.యాదమ్మ, ఎస్.యాదగిరి, ఎల్లయ్య, రాము, భిక్షం, సలీం, బాబు, శంకర్, ఎల్లేశ్, కృష్ణ పాల్గొన్నారు.