ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే ‘ప్రజాగోస’
ABN , First Publish Date - 2022-12-10T00:31:40+05:30 IST
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే ప్రజా గోస - బీజేపీ భరోసా యాత్ర చేపట్టినట్టు హుజురాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ అన్నారు.
రామగిరి, డిసెంబరు 9 : ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే ప్రజా గోస - బీజేపీ భరోసా యాత్ర చేపట్టినట్టు హుజురాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివా్సగౌడ్ చేపట్టిన ప్రజా గోస యాత్రను పానగల్ పచ్చల సోమేశ్వర ఆలయ ఆవరణలో ఈటల పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2018 ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ అనేక హమీలపై ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులపై డాడులు చేస్తు అక్రమ కేసులు బనాయిస్తూ సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని సమస్యలు పరిష్కారం కావాలంటే బీజేపితోనే సాధ్యమన్నారు. రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివా్సగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించే సత్తా కేవలం బీజేపికి మాత్రమే ఉందని గుజరాత ఎన్నికలు మరోసారి నిరూపించాయన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రానికి వచ్చిన ఈటలకు బీజేపి కార్యకర్తలను పెద్దఎత్తున స్వాగతం పలికారు. సోమేశ్వరఆలయంలో ప్రత్యేకపూజల అనంతరం ఈటల ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అఽధ్యక్షుడు కంకణాల శ్రీధర్రెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యుడు గోలి మధుసూదన రెడ్డి, జిల్లా ఇనచార్జి ప్రదీ్పకుమార్, పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వర్రావు, బండారు ప్రసాద్, నిమ్మల రాజశేఖర్రెడ్డి, దోసోజు యాదగిరి, పోటేపాల లింగస్వామి, పాలకూరి రవి, భూపాల్రెడ్డి, గణేష్ ఉన్నారు.
తిప్పర్తి మండలంలో ప్రజాగోస యాత్ర
తిప్పర్తి: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివా్సగౌడ్ చేపట్టిన ప్రజాగోస యాత్ర తిప్పర్తి మండలంలోని పజ్జూరు, గడ్డికొండారం, జంగారెడ్డిగూడెం, తిప్పర్తి, ఇండ్లూరు, మామిడాల గ్రామాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో గార్లపాటి జితేంద్రకుమార్, పార్టీ మండల అధ్యక్షుడు గుండా వినయ్కుమార్, పోతెపాక సాంబయ్య, పాశం శ్రీనివా్సరెడ్డి, మైనం మల్లయ్య, గంగాధర్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.