పేదరికం చదువుకు అడ్డుకాకూడదు : ఎంపీ
ABN , First Publish Date - 2022-02-19T06:13:48+05:30 IST
పేదరికం చ దువుకు ఏ మాత్రం అడ్డుకాకూడదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
నల్లగొండ టౌన, ఫి బ్రవరి 18: పేదరికం చ దువుకు ఏ మాత్రం అడ్డుకాకూడదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని వీటీ కా లనీలో పూల వ్యాపారం చేసుకునే నిరుపేద దంపతుల కూతురు పద్మశ్రీ ఇ టీవల మెడికల్ సీటు సా ధించింది. ఆర్థిక ఇబ్బందు ల గురించి ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా ఆమె చదువుకు అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని అందిస్తానని ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం రూ.75 వేల ఆర్థిక స హాయాన్ని అందజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ పద్మశ్రీ మెడికల్ వి ద్య పూర్తయ్యేంత వరకు ఫీజు మొత్తం తనే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. యు వత కష్టపడి చదివి లక్ష్యాలను సాధించాలన్నారు. అదేవిధంగా నల్లగొండ పట్టణాభివృద్ధితో పాటు ప్రజల ఇబ్బందులను కూడా పాలకులు పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. నుడా ప్లానలో ప్రజలకు ఇబ్బందులు కలిగే ప్రతిపాదనలు ఉ న్నాయన్నారు. జిల్లా కేంద్రంలోని పేదవారికి సిరిసిల్ల, సిద్ధిపేట మాదిరిగా డబు ల్ బెడ్రూం ఇళ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షు డు గుమ్ముల మోహనరెడ్డి, మునిసిపల్ ఫ్లోర్లీడర్ శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ లక్ష్మ య్య, ఎంపీపీ సుమన, వైఎస్ ఎంపీపీ పరమేష్, నాయకులు పాల్గొన్నారు.