ఎంజీయూలో పోస్టర్
ABN , First Publish Date - 2022-12-10T00:34:31+05:30 IST
హైదరాబాద్లో ఈ నెల 13వ తేదీ నుంచి నిర్వహించే ఎస్ఎ్ఫఐ 17వ జాతీయ మహాసభల వాల్పోస్టర్ను ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అరుణ ప్రియ ఆవిష్కరించారు.
నల్లగొండ, డిసెంబరు 9 : హైదరాబాద్లో ఈ నెల 13వ తేదీ నుంచి నిర్వహించే ఎస్ఎ్ఫఐ 17వ జాతీయ మహాసభల వాల్పోస్టర్ను ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అరుణ ప్రియ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 17 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఎ్ఫఐ మహాసభలు విజయవంతం కావాలన్నారు. ఎస్ఎ్ఫఐ మాజీ ఉపాధ్యక్షుడు మల్లె మల్లేష్ మాట్లాడుతూ విద్యారంగం సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్న ఎస్ఎ్ఫఐ దేశంలోనే అతి పెద్ద సంఘమన్నారు. కార్యక్రమంలో ఎస్ఎ్ఫఐ యూనివర్శిటీ నాయకులు డేగ మల్లేష్, కళ్యాణ్, వినిత, లింగరాజు, ప్రఽశాంత, భవాని, గౌతమి, అనురాధ, శిరీష్, సంధ్య, మమత, శ్రావణి, ప్రశాంతి, నిఖిత, ధనమ్మ పాల్గొన్నారు.