ప్రతి పౌరుడిలో దేశభక్తి జాతీయత పరిఢవిల్లాలి
ABN , First Publish Date - 2022-11-25T00:58:00+05:30 IST
ప్రతీ పౌరుడిలో దేశభక్తి, జాతీయ భా వం పరిఢవిల్లాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రేగట్టె మల్లికా ర్జున్రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు.
నార్కట్పల్లి, నవంబరు 24: ప్రతీ పౌరుడిలో దేశభక్తి, జాతీయ భా వం పరిఢవిల్లాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రేగట్టె మల్లికా ర్జున్రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. ఎంపీపీ నరేంద ర్రెడ్డి సౌజన్యంతో పట్టణంలో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమం గురువారం వంద రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా పట్టణం లో శతదినోత్సవ సభ, ర్యాలీ, ర్తకదాన శిబిరం నిర్వహించారు. ప్రడి పౌరుడిలో జాతీయ స్ఫూర్తి నింపుతూ ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. జాతీయ గీతాలాపన కార్యక్రమం 365 రోజుల నాటికి నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ఏర్పాటు చేసిన మాదిరిగానే నార్కట్పల్లిలోనూ ప్రధాన కూడలిలో భారీ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తానని ఎంపీపీ ప్రకటించారు. అమ్మనబోలు రోడ్డు నుంచి 75మీటర్ల జాతీయ పతాకంతో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. రక్తదాన శిబిరంలో 40మందికి యు వత రక్తదానం చేసి రెడ్క్రాస్ సంస్థకు అందజేశారు. క్విజ్, వ్యాస రచన, ఉపన్యాస పోటీల విజేతలకు బహుమతులు, రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సంస్థ చైర్మన్ గోలి అమరేందర్రెడ్డి, జనగణమన ఉత్సవ సమితి జిల్లా వ్యవ స్థాపక అధ్యక్షుడు కర్నాటి విజయ్కుమార్, కార్యదర్శి దోసపాటి శ్రీని వాస్, జనార్థన్, సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి, ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, దుబ్బాక శ్రీధర్, ఎస్ఆర్.వెంకటేశ్వర్లు, జనగనణమన ఉత్స వ సమితి నార్కట్పల్లి అధ్యక్షుడు కన్నెబోయిన నర్సింహ, ఎండీ. సాదత్ అలి, సోమ వెంకట్రెడ్డి, సంతోశ్, జాల వెంకన్న పాల్గొన్నారు.