పెద్ద చెరువు నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2022-09-21T06:25:27+05:30 IST
భువనగిరి పెద్ద చెరువు నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాశం భాస్కర్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నరేందర్, జిల్లా ఇన్చార్జి తుమ్మల మురళీధర్రెడ్డి అన్నారు.
భువనగిరి టౌన్, సెప్టెంబరు 20: భువనగిరి పెద్ద చెరువు నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాశం భాస్కర్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నరేందర్, జిల్లా ఇన్చార్జి తుమ్మల మురళీధర్రెడ్డి అన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంగళ వారం భువనగిరి పెద్ద చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి తర లిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులు, మాంసం దుకాణాల వ్యర్థాలను పెద్ద చెరువులో వేస్తున్నప్పటికీ నియంత్రించడంలో మునిసిపల్ యంత్రాంగం విఫలమైందన్నారు. కార్యక్ర మంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మేడి కోటేష్, బుగ్గ దేవేందర్, ఎర్ర వెల్లి నాగరాజు, కలకొండ రాము, ఏర్పుల శ్రీనివాస్, దాసరి స్వామి, మునిసిపల్ కౌన్సిలర్లు మాయ దశరథ, రత్నపురం బలరాం, రాకేష్, ఊదరి లక్ష్మి, కవిత, పాల్గొన్నారు