TS News.. నల్లగొండ: మునుగోడు కాంగ్రెస్‌లో మొదలైన ముసలం

ABN , First Publish Date - 2022-08-10T18:00:12+05:30 IST

మునుగోడు (Munugodu) కాంగ్రెస్‌లో (Congress) ముసలం మొదలైంది.

TS News.. నల్లగొండ: మునుగోడు కాంగ్రెస్‌లో మొదలైన ముసలం

నల్లగొండ (Nalgonda): మునుగోడు (Munugodu) కాంగ్రెస్‌లో (Congress) ముసలం మొదలైంది. ఇక్కడ ఉప ఎన్నిక (By-election) నేపథ్యంలో కాంగ్రెస్ నేత చలమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చే ప్రతిపాదనను  ఆ పార్టీ నేత, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె, పాల్వాయి స్రవంతి (Palvai Palvai) వ్యతిరేకిస్తున్నారు. ఆమె ఆడియో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. చండూరు సభ తన వల్లే సక్సెస్ అయ్యిందని, చలమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని స్రవంతి అన్నారు. కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే హుజురాబాద్ సీన్ రిపీట్ కావడం ఖాయమన్నారు. ఓడిపోయే వారికి టికెట్ ఇచ్చి రేవంత్ రెడ్డి పరువు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. గెలిచే వారికే కాంగ్రెస్‌ టికెట్ ఇవ్వాలంటూ పాల్వాయి స్రవంతి ఆడియో వైరల్‌ అవుతోంది.


మునుగోడు ఉప ఎన్నిక అంశం రోజురోజుకూ వేడెక్కుతోంది. బహిరంగ సభతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బోణీ చేయగా, ఈనెల 21 చౌటుప్పల్‌లో భారీ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏర్పాట్లు ప్రారంభించారు. ఉప ఎన్నికకు సంబంధించి అధికార టీఆర్‌ఎస్‌ సైలంట్‌ ఆపరేషన్‌కు తెరలేపింది. హుజూరాబాద్‌లో హడావుడి చేసి బోర్లాపడ్డ అనుభవంతో స్థానికంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. మంత్రి జగదీష్ రెడ్డి మూడు నెలలుగా ఈ ఏర్పాట్లు గుంభనంగా చేసుకుంటూ వస్తున్నారు. నేడో, రేపో తెరవెనుక టీఆర్‌ఎస్‌ చేసిన ప్రయత్నాలు బహిరంగం కానున్నాయి.

Updated Date - 2022-08-10T18:00:12+05:30 IST