వ్యక్తిపై కోతుల దాడి
ABN , First Publish Date - 2022-09-17T06:27:42+05:30 IST
మండలంలోని సీతారాంపురం గ్రామా నికి చెందిన పాలడుగుల నర్సయ్యను కోతులు శుక్రవారం వెంబడించి కరవడంతో తీవ్రగాయాలయ్యాయి.
అర్వపల్లి, సెప్టెంబరు 16: మండలంలోని సీతారాంపురం గ్రామా నికి చెందిన పాలడుగుల నర్సయ్యను కోతులు శుక్రవారం వెంబడించి కరవడంతో తీవ్రగాయాలయ్యాయి. నర్సయ్యను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. సీతారాంపురం గ్రామంలో కోతులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్థులు తెలిపారు వీటిని కట్టడి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.