TS News: మధు యాష్కీపై మాణిక్కం ఠాగూర్ అసహనం
ABN , First Publish Date - 2022-08-17T20:16:19+05:30 IST
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్.. మధుయాష్కీపై అసహనం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ (Manikkam Tagore) ఆధ్వర్యంలో బుధవారం గాంధీ భవన్లో మునుగోడు (Munugodu) ఉప ఎన్నిక (By-Election)పై సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో కొంతమంది కాంగ్రెస్ నేతల (Congress Leaders) తీరుపై సీరియస్ అయ్యారు. మునుగోడు వ్యూహ ప్రచార కన్వీనర్గా ఉన్న మధుయాష్కీ (Madhu Yashki) సమావేశానికి రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఇమేజ్ల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని హితవు పలికారు. అలాగే మునుగోడు మండల ఇన్చార్జులపై మాణిక్కం ఠాగూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.