CM KCR: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను పరశీలిస్తున్న కేసీఆర్
ABN , First Publish Date - 2022-11-28T13:51:14+05:30 IST
జిల్లాలోని వీర్లపాలెంలో గల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు.
నల్గొండ: జిల్లాలోని వీర్లపాలెంలో గల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పరిశీలించారు. పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల వివరాలను జెన్కో, బీహెచ్ ఎల్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్(Telangana CM) వెంట శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సిఎస్ సోమేష్ కుమార్, సిఎండి ప్రభాకర్ రావు, సీఎం ఓఎస్డి స్మితా సబర్వాల్, ఎంపీలు జోగినపల్లి సంతోష్, బడుగు లింగయ్య యాదవ్ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్, భాస్కర్ రావు, సైదిరెడ్డి, రవీంద్ర కుమార్, భగత్, శేఖర్ రెడ్డి ఉన్నారు.