రైతు సంక్షేమాన్ని విస్మరించిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-11-27T23:48:33+05:30 IST

రైతు సంక్షేమాన్ని విస్మరించిన కేసీఆర్‌

రైతు సంక్షేమాన్ని విస్మరించిన కేసీఆర్‌
హుజూర్‌నగర్‌లో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్‌, నవంబర్‌ 27: రైతు సంక్షేమాన్ని విస్మరించిన కేసీఆర్‌కు రైతులు గుణ పాఠం చెప్పాలని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఆదివారం పట్టణంలోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేయకుండా రైతులను వంచనకు గురి చేస్తోందన్నారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందన్నారు.తెలంగాణలో రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని తరిమికొట్టాలన్నారు. ఓటర్లను కొత్తగా నమోదు చేయించాల ని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తన్నీరు మల్లిఖార్జున్‌రావు, అల్లం ప్రభాకర్‌రెడ్డి, యరగాని నాగన్నగౌడ్‌, ఈడ్పుగంటి సుబ్బారావు, సాముల శివారెడ్డి, అరుణ్‌కుమార్‌ దేశ్‌ముఖ్‌,మంజునాయక్‌, కస్తాల శ్రావణ్‌, సంపత్‌రెడ్డి, భూక్య గోపాల్‌, జైలు, మహే్‌షగౌడ్‌, సత్యనారాయణ, అజీజ్‌పాషా, సత్యనారాయణ, నిజాముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T23:49:03+05:30 IST