కేసుల విచారణ త్వరగా పూర్తిచేయాలి : ఎస్పీ
ABN , First Publish Date - 2022-11-23T00:16:05+05:30 IST
జిల్లాలో నమోదవుతున్న తీవ్రమైన కేసుల విచారణ త్వరగా పూర్తిచేయాలని ఎస్పీ ఎస్. రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మా ట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని కే సులను చేధించాల న్నారు.
సూర్యాపేటక్రైం, నవంబరు 22: జిల్లాలో నమోదవుతున్న తీవ్రమైన కేసుల విచారణ త్వరగా పూర్తిచేయాలని ఎస్పీ ఎస్. రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మా ట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని కే సులను చేధించాల న్నారు. కేసుల నమోదు, విచారణ సమయంలో సాక్ష్యాల సేకరణ,అనుమానితుల విచారణ పక్కా గా ఉండాలన్నారు. ఏ ఒక్క అవకాశాన్నీ విడవకుండా కేసులు విచారించాలన్నారు. నేరం జరిగిన ప్రదేశాన్ని వి చారణాధికారి ఒకటికిరెండు సార్లు పరిశీలించాలని సూ చించారు. గుర్తుతెలియని మృతదేహాలు,అనుమానాస్పద మృతి, తప్పిపోయిన కేసుల్లో లోతుగా విచారణ చేయాల ని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు పరిక నాగభూషణం, జి. వెంకటేశ్వర్రెడ్డి, జి. ర వి, సీఐలు శ్రీనివాస్, సోంనారాయణసింగ్, శివశంకర్, రామలింగారెడ్డి, పీఎన్డీప్రసాద్, రాజేష్, ఆంజనేయులు, జి.రాజశేఖర్, నాగార్జున, గౌరినాయుడు, నర్సింహ పాల్గొన్నారు.