పెంచిన వాహనాల పన్నులను తగ్గించాలి

ABN , First Publish Date - 2022-05-18T07:21:44+05:30 IST

పెంచిన వాహనాల పన్నులను తగ్గించాలని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు కనగాల నాగేశ్వరరావు కోరారు.

పెంచిన వాహనాల పన్నులను తగ్గించాలి
కోదాడలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మను దహనం చేస్తున్న లారీ ఓనర్స్‌

కోదాడ టౌన్‌, మే 17: పెంచిన వాహనాల పన్నులను తగ్గించాలని  లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు కనగాల నాగేశ్వరరావు కోరారు. మంగళవారం రవాణా రంగ జేఏసీ ఆధ్వర్యంలో కోదాడలోని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయం ఎదురుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, ధరలు, బీమా ప్రీమియం, గీన్‌ ట్యాక్స్‌, పోలీసుల ఈ చలానాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నా మన్నారు.  పెంచిన ధరలను తగ్గించాలనే వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పైడి మర్రి వెంకటనారాయణ, విలాసకవి నర్సరాజు, పెద్ది అంజ్య, గౌస్‌, అప్పన్న, నాగేశ్వరరావు, అంజి, అశోక్‌, పాల్గొన్నారు. 

ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం 

హుజూర్‌నగర్‌  రూరల్‌: పట్టణంలోని కోదాడ రోడ్డులో లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను  దహ నం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.కార్యక్రమంలో కౌన్సిలర్‌ కోతి సంపత్‌రెడ్డి, రామిశెట్టి శ్రీను, శంకర్‌రావు, శ్రీనివాసరాజు,రవి, సత్యనారాయణ, మంచాల శ్రీను, బుల్లెట్‌ శ్రీను, నవీన్‌, శేఖర్‌రెడ్డి, ఆలీ, చందు, రవి, వీరబాబు, షేక్‌ సైదా పాల్గొన్నారు.


Updated Date - 2022-05-18T07:21:44+05:30 IST