కాల్వ నిర్మాణానికి అధిక ప్రాధాన్యం
ABN , First Publish Date - 2022-11-27T23:59:47+05:30 IST
చౌటుప్పల్ పట్టణంలోని ఊర చెరువు అలుగు నీటి కాల్వ నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.
చౌటుప్పల్ టౌన్, నవంబరు 27: చౌటుప్పల్ పట్టణంలోని ఊర చెరువు అలుగు నీటి కాల్వ నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. చౌటుప్పల్ పట్టణంలో ఆదివారం జరిగిన అభివృద్ధి కమిటీల విస్తృత సమావేశం మునిసిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఊర చెరువు అలుగు నీటితో పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల గకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్ని కలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషిచేస్తానని, మునిసిపాలిటీలో చేపట్టే అభివృద్ధి పనుల్లో వార్డు కమిటీల పాత్ర కీల కంగా ఉంటుందన్నారు. సమావేశంలో మునిసిపల్ కమిషనర్ కె. నర్సి ంహారెడ్డి, ఏఎంసీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, మునిసిపల్ వైస్చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సి లర్లు బండమీది మల్లే శం, పి. శ్రీధర్బాబు, ఎండి. బాబాషరీప్,. జి. లక్ష్మణ్, కె. సైదులు, అలె నాగరాజు, కె. లింగస్వామి, అరుణ, దండ హిమబిందు, కె. మంజుల, పి. అనిత, టి. శిరీషా, విజయ పాల్గొన్నారు.