మూడు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-08-17T06:21:26+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని కోదాడ రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. రూరల్‌ ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం..

మూడు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

కోదాడ రూరల్‌, ఆగస్టు 16: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని కోదాడ రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. రూరల్‌ ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన సుల్తాన్‌ వెంకన్న ఆటోలో జగ ్గయ్యపేటకు తరలిస్తున్న  మూడు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని మండలంలోని రెడ్లకుంట గ్రామం వద్ద స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ  తెలిపారు. 



Updated Date - 2022-08-17T06:21:26+05:30 IST