గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2022-11-27T00:17:46+05:30 IST
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
మఠంపల్లి, నవంబరు 26: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని పెదవీడు గ్రామంలో వైకుంఠధామం ప్రహారీకి శనివారం శంకుస్థాపన చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లెలన్నీ ప్రగతిపథంలో పయనిస్తున్నాయన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మన్నెం శ్రీనివాస్రెడ్డి, ఇరుగు పిచ్చయ్య, సర్పంచ్ బీబీకుతూబ్గూడ, ఎంపీటీసీ కుందూరు వెంకట రెడ్డి, సాముల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హుజూర్నగర్: సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరా మరక్ష అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం హుజూర్నగర్కు చెందిన ప్రొఫె సర్ ఇనుకుర్తి అనిల్కుమార్ ఆధ్వర్యంలో 50మంది ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఎనిమిది సంవత్సరాలుగా రాజకీ యాలకు అతీతంగా ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో అమర్నాధ్రెడ్డి, మన్నెం శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని మం చ్యాతండాకు చెందిన లబ్ధిదారురాలికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే పంపిణీ చేశారు.