క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట

ABN , First Publish Date - 2022-11-28T01:34:10+05:30 IST

క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ అన్నారు. ఆదివారం పట్ట ణంలో కేసీఎల్‌ క్రికెట్‌ లీగ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

 క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట
క్రికెట్‌ క్రీడాకారులతో ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌

కోదాడ, నవంబరు 27: క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ అన్నారు. ఆదివారం పట్ట ణంలో కేసీఎల్‌ క్రికెట్‌ లీగ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ మండలంలో క్రీడా మైదా నాలు, జిల్లా కేంద్రాలో నియోజకవర్గ కేంద్రాల్లో మిని స్టేడియాలు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లాల్లో ప్రతీ క్రీడకు అసోసియేషన్లు ఏర్పాటు చేసి ఆ శాఖ ద్వారా నిధులు మంజూరు చేస్తోందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ కవితారెడ్డి, వెంపటి పద్మ, చందు నాగేశ్వరరావు, మైసా రమేష్‌, మేదర లలిత, శ్రీనివాస్‌, రమా శ్రీని వాస్‌, అంజన్‌గౌడ్‌, ప్రసాద్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, బత్తుల ఉపేందర్‌, వంశీ, లాజర్‌, రమేష్‌, భరత్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T01:34:56+05:30 IST